శంక‌ర్‌కి షాకిచ్చిన రాజ‌మౌళి..?

ఒకప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అని అంద‌రూ అనుకునేవారు.. కానీ ద‌క్షిణాదికి చెందిన కోలీవుడ్ డైరెక్ట‌ర్ త‌మిళ సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటారు. ఆయ‌న రూపొందించిన జెంటిల్‌మేన్‌, ఒక్క‌డున్నాడు, ఇండియ‌న్‌, జీన్స్‌, రోబో త‌దిత‌ర చిత్రాలు కంటెంట్ ప‌రంగానే కాదు.. మేకింగ్ వేల్యూస్ ప‌రంగానూ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయంటూ ప్ర‌శంస‌లు అందుకున్నాయి. కానీ ఇప్పుడు శంక‌ర్‌ను మించేలా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమాలు తెర‌కెక్కిస్తున్నాడు. బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ సినిమానే కాదు...తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటాడు రాజ‌మౌళి. దీంతో ద‌క్షిణాది శంక‌ర్ గొప్ప‌వాడా? రాజ‌మౌళి గొప్పోడా? అనే వాద‌న కూడా బ‌య‌లు దేరింది. చివ‌ర‌కు రాజమౌళి ఇప్పుడు టాప్‌లో నిలిచి ఉన్నాడు.

ఇప్పుడు శంక‌ర్‌, రాజ‌మౌళి మ‌ధ్య సినిమాల పరంగా భారీ పోటీనే నెల‌కొంది. శంక‌ర్‌ను మించి పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారిన రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' సినిమాను తెర‌కెక్కిస్తోన్నసంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు రోబో త‌ర్వాత ఆ రేంజ్ స‌క్సెస్ లేని శంక‌ర్‌, మ‌ళ్లీ త‌న హ‌వాను చాటాల‌ని 'ఇండియ‌న్ 2' సినిమాను క‌మ‌ల్‌హాస‌న్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. నిజానికి 'ఇండియ‌న్ 2' ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుద‌ల‌వుతుంద‌ని అనుకున్నారు. అయితే సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇప్పుడు సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే షూటింగ్ పూర్తయ్యేలా ఉంది. దీంతో ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని శంక‌ర్ భావించాడు.

అయితే శంక‌ర్ ఆలోచ‌న‌ల‌కు రాజ‌మౌళి బ్రేకులేశాడు. ఎందుకంటే ఆయ‌న కంటే ముందుగానే రాజ‌మౌళి త‌న 'ఆర్ఆర్ఆర్‌' సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించేశాడు. దీంతో ఇప్పుడు శంక‌ర్‌కు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చి ప‌డింది. రాజ‌మౌళి సినిమాతో త‌న సినిమాను విడుద‌ల చేయలేడు. అక్క‌డే మార్కెట్ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. దీంతో శంక‌ర్ 'ఇండియ‌న్ 2'ను వెన‌క్కి తీసుకెళ్లక త‌ప్పేలా లేదు. అనుకోని షాక్‌తో శంక‌ర్ స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ట‌.

More News

సినీ ఇండ‌స్ట్రీ పై ఐటీ దాడులు.. ఎంత డ‌బ్బు ప‌ట్టుకున్నారో తెలుసా!

సినీ ఇండ‌స్ట్రీపై ఐటీ శాఖ దాడులు చేసిందా? అదేంటి? అదెప్పుడు అనే సందేహాలు రాక మాన‌వు. నిజానికి ఐటీ శాఖ దాడులు చేసింది టాలీవుడ్‌లో కాదు..

ప్ర‌భాస్ సినిమాలో మ‌రో హీరోయిన్.. ఎగిరి గంతేస్తున్న యంగ్ బ్యూటీ

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

టీడీపీలో చీలిక రాబోతోంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా? : పవన్

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘కియా మోటార్స్‌’ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందంటూ సోషల్ మీడియాలో..

లోకేశ్‌కు షాకిచ్చిన జగన్ సర్కార్

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది. ఇప్పటి వరకూ లోకేశ్‌కు ఉన్న ‘వై’ కేటగిరీ భద్రతను తగ్గించింది.