హైదరాబాద్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి...!!

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో షీటీమ్స్ అంటూ పోలీసులు కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ ఆడపిల్లలపై దాడులు మాత్రం ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్‌ బేగంపేటలోని లెస్బెన్‌ పబ్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ డ్యాన్సర్‌పై దాడి జరిగింది. నడిరోడ్డుపై తనను వివస్త్రన చేసి, దాడికిపాల్పడ్డారని క్లబ్‌ డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి కన్నీరుమున్నీరైంది.

అండగా నిలవాల్సిన నిర్వాహకులు..!

వివరాల్లోకెళితే.. సినిమాల్లో చాన్స్‌ల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి ఆర్థిక సమస్యల కారణంగా క్లబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే అదే పబ్‌లో తనతో కొందరు కస్టమర్లు తాగి అసభ్యంగా ప్రవర్తించేవారని.. మరికొందరైతే కోరిక తీర్చాలంటూ వేధించారని పోలీసు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అంతేకాదు.. కస్టమర్లు ఇలా చేస్తుంటే తమ ఉద్యోగికి అండగా నిలవాల్సిన క్లబ్ నిర్వాహకులు కనీసం పట్టించుకోకపోగా తనపై ఒత్తిడి చేశారని వాపోయింది. 'ఇటువంటి అసాంఘీక కార్యక్రమాలకు అంగీకరించలేదు. దీంతో వారంతా నాపై కక్ష్య కట్టారు. తరచూ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడేవారు. పబ్‌లో బ్లేడ్‌లతో ఒళ్లంతా గాయాలు చేసే వారు.

అర్ధరాత్రి నడిరోడ్డుపై..!

శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తుండగా బేగంపేటలో నడిరోడ్డుపై నలుగురు అమ్మాయిలు, మరోవ్యక్తితో కలిసి తనపై దాడి చేశారని ఆమె చెబుతోంది. తన ఒంటిపై బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించారని కంటతడిపెట్టింది. అంతేకాదు.. ఇలా చేసినట్లు ఎవరికైనా చెబితే బాగోదని బెదిరించి.. ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసంటూ బెదిరించినట్లు డ్యాన్సర్ చెబుతోంది. అయితే సయ్యద్ అనే వ్యక్తి వీళ్లందరికి బాస్ అని ఆమె పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాధితులు ఇంకెందరో..!

అయితే తనలాగా క్లబ్‌లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని.. తనతో పాటు వారికి కూడా న్యాయం చేయాలని డ్యాన్సర్ పోలీసులను వేడుకుంది. అయితే త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారని డ్యాన్సర్ మీడియాకు వెల్లడించింది.

కాగా.. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజురోజుకు ఎక్కువవుతోంది. పోలీసులు అప్పుడప్పుడు క్లబ్‌లపై దాడులు చేసినప్పటికి మమా అనిపించేసి మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే నిర్వాహకులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు పోలీసులు న్యాయం చేయాల్సి ఉంది. అయితే ఇలా ఎక్కువగా రాజకీయ, ప్రముఖులకు చెందిన వారి పిల్లలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి 'విరాట‌ప‌ర్వం' ప్రారంభం

రానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

'కిల్లర్' విజయం అరుదైనది - అర్జున్

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'..

టీడీపీ ఘోర ఓటమికి కారణాలివే.. కుండ బద్ధలు కొట్టిన నేతలు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిపై సమీక్షలు మొదలు పెట్టింది. వైసీపీకి ఊహించని భారీ మెజార్టీ సీట్లు దక్కడం టీడీపీకి మాత్రం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు...

విశాల్‌పై వ‌ర్మ‌ల‌క్ష్మి ఘాటు వ్యాఖ్య‌లు

హీరో, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్‌పై వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అందుకు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ను వేదిక‌గా చేసుకున్నారామె.

విజ‌య‌వాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా: రాజ్ త‌రుణ్

రీసెంట్‌గా సోష‌ల్ మీడియా చాట్‌లో తాను ప్రేమ వివాహం చేసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే త‌న పెళ్లి క‌బురు చెబుతాన‌ని హీరో రాజ్‌త‌రుణ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.