close
Choose your channels

కోడెల ఫోన్ కాల్స్‌లో ఆ రెండు నెంబర్లు ఎవరివి!?

Wednesday, September 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోడెల ఫోన్ కాల్స్‌లో ఆ రెండు నెంబర్లు ఎవరివి!?

తెలుగుదేశం కీలక నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? ఇంట్లో గొడవలు జరిగాయా.? లేకుంటే రాజకీయ ఒత్తిళ్లతో ఆయన చనిపోయారా..? కుమారుడే కారణమా..? ఇలా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే కోడెల కుమార్తె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వేధింపుల వల్లే తండ్రి చనిపోయారని.. ఇంతకు మించి తమకు ఏమీ అనుమానాలేవని తేల్చిచెప్పారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీసులకు కోడెల కుమార్తె ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో కీలక అంశాలను పోలీసులు బయటపడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్యకు ముందు..!

12 రోజులుగా బయటి వ్యక్తులతో కోడెల మాట్లాడలేదు. ఆత్మహత్యకు మందు 24 నిమిషాలు చివరి ఫోన్‌కాల్ మాట్లాడారు. సోమవారం ఒక్కరోజే మొత్తం ఎనిమిది ఫోన్ కాల్స్ మాట్లాడారు. టిఫిన్ చేస్తూనే ఎవరితోనే ఆయన ఫోన్‌లో మాట్లాడారు. 24 నిమిషాలు మాట్లాడిన తర్వాత కోడెల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత బెడ్రూమ్‌లోకి వెళ్లి కోడెల ఉరేసుకున్నారు’ అని పోలీసు ఉన్నతాధికారులు తేల్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఆ 24 నిమిషాలు ఎవరితో మాట్లాడరన్నది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? పార్టీ నేతలతోనే ఆయన మాట్లాడారా..? లేకుంటే కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరితోనైనా మాట్లాడారా..? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

మరోసారి రంగంలోకి దిగిన క్లూస్ టీమ్!

ఇదిలా ఉంటే.. మంగళవారం నాడు పోలీసులు, క్లూస్‌ టీం మరోసారి కోడెల ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా నిశితంగా పరిశీలించిన క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించింది. ఉరి వేసుకోడానికి ఉపయోగించిన కేబుల్‌ వైర్‌తో పాటు.. ఒక కుర్చీపై మరొకటి ఇలా మూడు కుర్చీలు అమర్చి ఉన్నట్లు గుర్తించి ఆధారాలు సేకరించారు. అంతేకాదు.. మరణానికి ముందు ఆయన 22 ఫోన్లు చేసినట్లు.. అందులో రెండు నంబర్లతో 20 నిముషాల పాటు మాట్లాడినట్లు పోలీసులు తేల్చారు. అయితే ఆ నంబర్లు ఎవరివి..? ఎవరితో మాట్లాడారు..? అనే వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మొత్తానికి చూస్తే.. కాల్ డేటాను పట్టుకుంటే సింపుల్‌గా ఎవరితో మాట్లాడారో..? ఎవరితో ఏమేం మాట్లాడారో తేలిపోతుందన్న మాట. సో.. మరి పోలీసులు ఎప్పుడు ఈ విషయాలన్నీ తేలుస్తారో..? వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.