మంచి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం గడిచిన 9 నెలల అభివృద్ధిని ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి మన్నవ శరదా దేవి గారు రచించిన ‘‘కూటమి పాలనలో అభివృద్ధి-సంక్షేమం’’ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ప్రభుత్వం ముందున్న సవాళ్లను తెలియజేస్తుందని శరదాదేవిని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మందడి వెంకట్రామయ్య, మందడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతల్ని, సాగించిన పాలనను, అందించిన సంక్షేమ ఫలాల్ని పుస్తకంలో చక్కగా వివరించారు. ఓవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, పేదలకు, బడుగుబలహీన వర్గాలకు ఎలాంటి లోటు లేకుండా కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని పుస్తకంలో రాసుకొచ్చారు శారదాదేవి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com