బోటు ప్రమాద బాధితులను చూసి జగన్ భావోద్వేగం!

  • IndiaGlitz, [Monday,September 16 2019]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏరియల్ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరిన సీఎం ముందుగా గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పర్యవేక్షించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను సీఎం పరామర్శించారు.

లాంచీ ప్రమాదంపై విచారణకు ఆదేశం
లాంచీ ప్రమాద ఘటనపై జగన్‌ విచారణకు ఆదేశించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన.. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. లాంచీ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సమయంలో గోదావరిలోకి లాంచీ అనుమతి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రెవెన్యూ చీఫ్‌ సెక్రటరీ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, లాండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీలను సభ్యులుగా చేర్చారు. మూడు వారాల్లో ప్రమాదంపై నివేదిక ఇవ్వాలని, 45 రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చాలా బాధ కలిగింది!
ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సమయంలో వారు చెబుతున్న మాటలు విని చాలా బాధ కలిగిందన్నారు. ఈ సందర్భంగా లాంచీ ప్రమాదం ఎలా జరిగింది..? సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని ఆయన ఆరా తీశారు. ఇందుకు స్పందించిన అధికారులు గోదావరి నది లోపల 300 అడుగుల లోతులో లాంచీ మునిగిందని తెలిపారు. మునిగిన లాంచీని వెంటనే వెలికి తీసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ప్రతి నెలా ఫిట్‌నెస్!
‘లాంచీలకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్‌ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. బోట్ల పరిస్థితి ఏంటీ..? ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారా..? వారం రోజుల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటులో పోలీసు, ఇరిగేషన్, టూరిజం విభాగాలను భాగస్వామ్యం చేయాలి. బోట్లకు ఎప్పుడు అనుమతి ఇవ్వాలో ఇరిగేషన్‌ అధికారులు గుర్తించాలి. ప్రతి నెలా ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని పర్యాటక బోట్ల స్థితిగతులపై సమీక్ష జరపాలి’ అని ఈ సందర్భంగా అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

More News

పవన్- ప్రభాస్‌తో మూవీపై క్లారిటీ.. ఎన్టీఆర్‌కు హిట్టిస్తా!

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌లతో సినిమా చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

దిల్‌రాజుతో గొడవలపై హరీశ్ శంకర్ స్పందన

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

`RRR` బల్గేరియా షెడ్యూల్ పూర్తి

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`. దాదాపు రూ.300కోట్ల‌కుపై బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు.

‘వాల్మీకి’ వివాదం: నాకేం తెలీదు కథ మాత్రమే!

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల హరీష్‌ శంకర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

'వాల్మీకి' పై సెన్సార్‌బోర్డుకి ఫిర్యాదు

త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా`ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తోన్న చిత్రం `వాల్మీకి`. సెప్టెంబ‌ర్ 20న సినిమా విడుద‌ల‌వుతుంది.