YS Jagan: ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న సీఎం జగన్

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

ఏపీలో ఎన్నికల సమరానికి సమయం సిద్ధమైంది. మరో రెండు రోజల్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది. ఈనెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఇడుపులపాయలో సీఎం జగన్ ప్రకటించనున్నారు. గత ఎన్నికల్లో ఇడుపులపాయ వేదికగానే అభ్యర్థులను ప్రకటించడంతో ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను వెల్లడించనున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లుగా నియమించిన వారినే అభ్యర్థులుగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రూట్ మ్యా్ప్ ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే 12 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా 12వ జాబితాలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి గుడివాడ అమర్మాథ్, చిలుకూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా కావాటి మనోహర్ నాయుడుని నియమించింది. అలాగే గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్‌గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది. ఇక శాసనమండలి విప్‌‌గా జంగా కృష్ణమూర్తి స్థానంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణిని నియామిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

కాగా ఇప్పటివరకు విడుదలైన మొత్తం జాబితాలలో 75 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జీలను నియమించింది. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలడమే టార్గెట్‌గా పెట్టుకున్న పార్టీ చీఫ్ జగన్.. ఆ దిశగా బలమైన అభ్యర్థలను ఎంపికచేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్ నిరాకరించారు. టికెట్ రాని నేతలకు మళ్లీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పి్స్తామని హామీ ఇస్తున్నారు.

మరోవైపు గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు. తదుపరి నంద్యాల జిల్లా బనగానపల్లిలో రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద నిధులు విడుదల చేయనున్నారు.

More News

చిలకలూరిపేట సభకు భూమి పూజ.. పాల్గొన్న టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు..

ఈనెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సంయుక్తంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభా ప్రాంగణానికి భూమి పూజ చేశారు.

వాహనాల రిజిస్ట్రేషన్ TS నుంచి TGకి మార్పు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌లకు TG ప్రిఫిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి గతంలో

డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు.. కొత్త రేషన్ కార్డులు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది

PawanKalyan: భీమవరాన్ని వదలను.. కచ్చితంగా గెలిచి తీరాలి: పవన్ కల్యాణ్‌

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల కోతపై జనసేనాని పవన్ కల్యాణ్‌ స్పందించారు. సీట్లు తక్కువా.. ఎక్కువా.. అనేది పక్కన పెట్టండని..175 స్థానాల్లో జనసేన, టీడీపీ, బీజేపీలు పోటీ చేస్తున్నాయని

Pawan Kalyan: చంద్రబాబు వ్యూహంలో చిక్కుకుపోయిన జనసేనాని.. రగిలిపోతున్న కార్యకర్తలు..

రాష్ట్ర రాజకీయాలను మారుస్తాను.. అధికారంలో భాగస్వామ్యం అవుతాం.. అంటూ బీరాలు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎంతలా అంటే పొత్తులో భాగంగా 175 సీట్లలో కేవలం 24 సీట్లు,