BRS పేరుతో కొత్త జాతీయ పార్టీ.. ప్లీనరీలో కేసీఆర్ సంకేతాలు

  • IndiaGlitz, [Wednesday,April 27 2022]

జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే థర్డ్ ఫ్రంట్‌పై రకరకాల ప్రయత్నాలు చేయడంతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలను కూడా కలిశారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. దేశాన్ని సరైన దిశలో నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలం అయ్యాయని, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక రావాల్సిన అవసరాన్ని కేసీఆర్ చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించడం లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్‌కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోడుకావడంతో సీన్ మరోలా మారబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదగాలనే లక్ష్యం వైపు సాగేలా జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ శక్తి ఏర్పాటు కావాలన్నారు. రాజకీయ ఫ్రంట్‌ల వల్ల ఏం జరిగిందని ప్రశ్నించిన కేసీఆర్.. జరగాల్సింది రాజకీయ పునఃరేకీకరణ కాదని వ్యాఖ్యానించారు.

దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండా, దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లే సిద్ధాంతమన్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను కొందరు ఇస్తున్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎలాగైతే సాధించామో.. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ప్రక్రియ జరగాల్సి ఉందన్నారు. తాను పెట్టాలనుకుంటే భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ ఉంటుందని ఇటీవలి జార్ఖండ్ పర్యటన సందర్భంగా తెలియజేశానని కేసీఆర్ గుర్తుచేశారు.

More News

ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌పై విమర్శలు.. టైం చూసి గట్టిగా ఇస్తాం : మంత్రులకు నాగబాబు వార్నింగ్

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీస్ వ్యవస్థను వై.సీ.పీ. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు

డాక్టర్లు చికిత్స చేస్తారా, అంబులెన్స్‌లు పంపుతారా.. సర్కార్ వైఫల్యంతోనే ఇలా : రుయా ఘటనపై పవన్ ఆవేదన

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ‘‘అంబులెన్స్’’ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కేజీఎఫ్ మేకర్స్ చేతుల్లో డా. రాజ్‌కుమార్ మనవడి ఎంట్రీ.. లుక్ వైరల్

‘కేజీఎఫ్ 2’ సూపర్‌హిట్ కావడంతో చిత్రబృందం సక్సెస్ జోష్‌లో వుంది. ‘కేజీఎఫ్’ సిరీస్‌ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో

తెలంగాణలో కొలువుల జాతర: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్‌తోనే ఎంపిక

తెలంగాణలో 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

'సిద్ధ' పాత్ర చరణ్‌కు బదులు పవన్‌ చేసుంటే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆచార్య’’ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.