Revanth: ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Monday,April 29 2024]

ఢిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని గుర్మిట్కల్‌లోని ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ సర్కార్ ఇప్పటివరకు ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తోందని.. ఈసారి కొత్తగా ఢిల్లీ పోలీసులను పంపించిందని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరని స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటలో బీజేపీని ఓడించి తీరుతామని సవాల్ విసిరారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారని.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో లక్ష మెజారిటీతో గుర్మిట్కల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గుర్మిట్కల్‌ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే ఎన్నికయ్యారని తెలిపారు. మీరు ఎన్నుకున్న ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని... ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామన్నారు.

ప్రధాని మోదీ పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారని మండిపడ్డారు. 40 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోదీ.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. 2019 ఎన్నికలక్లో కర్ణాటక నుంచి 26 మంది ఎంపీలను గెలిపిస్తే.. మోదీ కర్ణాటకకు ఇచ్చింది కేవలం ఒకటే కేబినెట్ పదవి అని తెలిపారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు తప్ప ఇచ్చింది ఏం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు వస్తే కనీసం బెంగుళూరుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అందుకే మోదీకి కన్నడ ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు.

కాగా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సిద్దిపేట సభలో మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.

More News

Nominations Withdraw: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో కీలమైన నామినేషన్ల ప్రక్రియకు నేటితో తెరపడింది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు...

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.

Pensions: ఏపీలో ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఎన్నికల వేళ ఎట్టకేలకు పింఛన్ల పంపిణీపై స్పష్టత వచ్చింది. మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దివ్యాంగులు

Dharmana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమలు చేయడం లేదు.. మంత్రి ధర్మాన క్లారిటీ..

ఏపీలో ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ చట్టంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ చట్టం ద్వారా రైతుల భూములు, ఆస్తులు లాక్కునేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Asaduddin Owaisi:ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడతారు.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

దేశంలో స్వార్వత్రిక ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.