CM Jagan: నన్ను బచ్చా అంటున్న చంద్రబాబు పొత్తులతో ఎందుకు వస్తున్నాడు: సీఎం జగన్

  • IndiaGlitz, [Saturday,April 20 2024]

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఒక బచ్చా అని కూడా అంటున్నాడు. అయితే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, పూతన, కాళిందిని చూస్తే బాబు గుర్తుకు వస్తున్నారు. రాముడ్ని బచ్చా అనుకున్న సుబాహుడు, మారీచుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేషంలోనూ కనిపిస్తున్నారు. హనుమంతుడ్ని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లను చూస్తే గుర్తుకొస్తున్నాడు. నేను బచ్చా అయినా ఒంటరిగా, ధైర్యంగా పోటీ చేస్తున్నాను. బచ్చా అయితే నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి ప్రశ్నించారు.

జగన్‌ను ఓడించాలని వారు... పేదలను గెలిపించాలి, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ పోరాటంతో 2024 ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అందుకు మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయి. ఆ ఉక్రోషం, కడుపుమంట భగ్గుమని చంద్రబాబు నాపై రాళ్లు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇదీ చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మల అజెండా. దీనికోసం వాళ్లకు అధికారం కావాలట... జగన్ ను కొట్టడానికి, జగన్ కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలట.

నేను బచ్చా అయితే... ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వొక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలడంలేదు... అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్ను ఏమనాలి? నేను బచ్చా అయితే... ఈ 58 నెలల్లో గ్రామాలకు, రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాలకు నేను చేసిన మంచి, ఇంటింటికీ చేసిన అభివృద్ధి... నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావు బాబూ? నిన్ను ఏమనాలి? అంటూ నిలదీశారు.

మీ బిడ్డ అధికారంలోకి రాకముందు ఇలాంటి పధకాలు అందాయా? ఇది జగన్ మార్క్ పాలన. చంద్రబాబు మార్క్ పాలన ఏముంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేర్చి అందరికీ అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాం. ప్రజలకు ఇంత మంచి చేసిన ప్రభుత్వం కావాలా? కేవలం నలుగురు దోచుకుని తినే ఆ చంద్రబాబు కావాలా? మీరే తేల్చుకోవాలి అని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.

More News

Revanth Reddy: మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామనేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు.

Chandrababu:జగన్‌ను మరోసారి నమ్మితే రాష్ట్రం అధోగతి పాలు: చంద్రబాబు

తల్లిని, చెల్లిని చూడలేని వ్యక్తి రాష్ట్రాన్ని చూస్తారా? అని సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Harish Shankar:చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్‌ శంకర్ వార్నింగ్

దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar), కెమెరామెన్ చోటా కె నాయుడు మధ్య కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తాజాగా రచ్చకెక్కాయి.

ఏపీలో విజయం వైసీపీదే.. టీడీపీ అంతర్గత సమావేశం వీడియో లీక్..

ఏపీలో ఎక్కడా చూసిన వైసీపీ ప్రభంజనమే కనిపిస్తోంది. సీఎం జగన్ సభలకు జనం తాండోపతండాలుగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలతో పాటు

Pemmasani:పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారు: పెమ్మసాని

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ నిర్వీర్యం చేశారని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు.