ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరు..

  • IndiaGlitz, [Tuesday,September 08 2020]

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.

జయప్రకాష్‌రెడ్డి.. కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని సిరివెళ్ల గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1946 మే 8న జన్మించారు. ఆయన తండ్రికి నాటకాలపై ఆసక్తి ఉంటడంతో తండ్రీకొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ జయప్రకాష్‌రెడ్డి ముందుండే వారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ నటనపై మక్కువతో నాటక ప్రదర్శనలు మాత్రం ఇస్తుండే వారు. అలా ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావు చూశారు.

జయప్రకాష్‌రెడ్డి నటనకు ముగ్ధుడైన దాసరి.. నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా జయప్రకాష్‌రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం ప్రతినాయకునిగా మంచి పేరును తీసుకురావడమే కాకుండా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి చిత్రాలతో జయప్రకాష్‌రెడ్డి మరింత ఫేమస్ అయ్యారు. జయప్రకాష్ రెడ్డి చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

More News

ప్రియమణి ప్రధాన పాత్రలో బహుభాష చిత్రం 'కొటేషన్ గ్యాంగ్'

హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.

చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అటు ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. ఇటు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు.

ఎస్పీబీకి క‌రోనా నెగ‌టివ్‌

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా వైర‌స్ కార‌ణంగా కొన్నిరోజులుగా హాస్పిట‌ల్‌ల‌కే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే.

మహేశ్‌ను బాలీవుడ్ స్టార్ ఢీ కొడ‌తాడా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న 27వ సినిమాగా `స‌ర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కన్ఫ్యూజన్ ‘రంగ్ దే’ టీమ్

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’