కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు.. మహిళ ఫిర్యాదుతో పోలీసులకు షాక్

  • IndiaGlitz, [Saturday,June 26 2021]

ఓ స్వామిజీ తన కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు అంటూ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు సైతం దిమ్మ తిరిగేలా ఉన్న ఈ సంఘటన బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. ఓ స్వామిజీ తన కలలోకి వచ్చి పదేపదే అత్యాచారం చేస్తున్నాడు అంటూ ఓ మహిళ పోలీసులకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది.

ఆమె ఫిర్యాదుతో పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. అయితే పోలీసులు విచారణ జరపగా తప్పలేదు. స్వామీజీని పిలిచి విచారించినా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. అయితే ఓ విషయం మాత్రం అర్థం అయింది. సదరు మహిళ కుమారుడికి జనవరిలో జబ్బు చేసింది. నయం చేయించడం కోసం ఆమె తన కొడుకుని స్వామిజి దగ్గరకు తీసుకువెళ్ళింది.

స్వామిజీ ఆమెకు ఓ మంత్రం చెప్పి దాన్ని జపిస్తూ కొన్ని నియమాలు పాటించాలని సూచించాడు. అయితే రెండు వారాల తర్వాత ఆమె కుమారుడు మరణించాడు. దీనితో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. వెళ్లి స్వామీజీని నిలదీసింది. తన కుమారుడి మరణానికి స్వామీజీని నిందించింది.

కొన్నిరోజుల తర్వాత ఇప్పుడిలా స్వామీజీపై ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం ఆమె మానసిక సరిగ్గా లేదని.. చికిత్స అవసరం అని పోలీసులు అంటున్నారు. ఆమె బందువులకు విషయం వివరించి పంపించారు.

More News

కత్తి మహేష్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

సినీ విమర్శకులు, నటుడు కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శనివారం

ఇక్కడ రాంచరణ్ తో.. అక్కడ రణవీర్ సింగ్ తో..

ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలు చేస్తున్నప్పటికీ కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది.

నేనేంటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నాగబాబుపై నరేష్ కామెంట్స్

'మా' ఎన్నికల్లో విమర్శలకు తావు లేదంటూనే ఒకరిపై ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.

ప్రకృతి ఒడిలో లావణ్య త్రిపాఠి కేఫ్ నిర్మాణం. ఆమె ప్లాన్ ఏంటంటే!

అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు.

ఓ డైరెక్టర్ నా క్లీవేజ్ చూడాలన్నాడు.. మరొకడు ఏకంగా..

బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుర్వీన్ చావ్లా ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది.