close
Choose your channels

కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు.. మహిళ ఫిర్యాదుతో పోలీసులకు షాక్

Saturday, June 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఓ స్వామిజీ తన కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు అంటూ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులకు సైతం దిమ్మ తిరిగేలా ఉన్న ఈ సంఘటన బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. ఓ స్వామిజీ తన కలలోకి వచ్చి పదేపదే అత్యాచారం చేస్తున్నాడు అంటూ ఓ మహిళ పోలీసులకు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది.

ఆమె ఫిర్యాదుతో పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. అయితే పోలీసులు విచారణ జరపగా తప్పలేదు. స్వామీజీని పిలిచి విచారించినా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. అయితే ఓ విషయం మాత్రం అర్థం అయింది. సదరు మహిళ కుమారుడికి జనవరిలో జబ్బు చేసింది. నయం చేయించడం కోసం ఆమె తన కొడుకుని స్వామిజి దగ్గరకు తీసుకువెళ్ళింది.

స్వామిజీ ఆమెకు ఓ మంత్రం చెప్పి దాన్ని జపిస్తూ కొన్ని నియమాలు పాటించాలని సూచించాడు. అయితే రెండు వారాల తర్వాత ఆమె కుమారుడు మరణించాడు. దీనితో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. వెళ్లి స్వామీజీని నిలదీసింది. తన కుమారుడి మరణానికి స్వామీజీని నిందించింది.

కొన్నిరోజుల తర్వాత ఇప్పుడిలా స్వామీజీపై ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం ఆమె మానసిక సరిగ్గా లేదని.. చికిత్స అవసరం అని పోలీసులు అంటున్నారు. ఆమె బందువులకు విషయం వివరించి పంపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.