‘విక్రమ్’ ల్యాండర్ జాడపై ఏంటీ కన్ఫూజన్.. కన్ఫూజన్!

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా.. అది కుప్పకూలిన విషయం విదితమే. అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటం, దానికి తోడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండర్ జాడను కనుగొనడానికి శాస్త్రవేత్తలు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఆ చీకటి తొలగిపోయి ఆ ప్రాంతంలో వెలుగు రావడంతో ల్యాండర్‌ జాడను నాసా కనిపెట్టింది. మంగళవారం రోజున ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది.

అబ్బే మేమే ఫస్ట్!
అయితే కనిపెట్టింది నాసా కాదని మనమేనని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నాసా ప్రకటనను తోసిపుచ్చారు. దాని జాడను తాము ఎప్పుడో కనిపెట్టామని ప్రకటించారు. ‘చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైన విక్రం ల్యాండర్ జాడను మూడు రోజుల తర్వాత మేమే గుర్తించాం. మా సొంత ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. ఇందుకు సంబంధించి వివరాలు కావాలంటే ఇస్రో వెబ్ సైట్లో చూడొచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే, నాసా ఉంచిన చిత్రాల్లో ముక్కలైన ల్యాండర్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇస్రో చిత్రాల్లో అటువంటి దేమీ లేదు. ల్యాండర్ ఢీకొట్టిన ప్రాంతాన్ని చిన్న చుక్కగా మాత్రమే చూపించడం గమనార్హం.

నాసా ఏం చెప్పింది..!?
ల్యాడర్ ఎక్కడ కూలిందో గుర్తించామని.. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని.. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని నాసా మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపిన విషయం విదితమే. కాగా.. సుమారు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నాసా ప్రకటనతో షార్‌లోని శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చివరి క్షణాల్లో అది క్రాష్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ ఆచూకీని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అహర్నిశలు శ్రమించి చివరికి వాటి శకలాలను గుర్తించింది.

అసలేంటి ఈ కన్ఫూజన్!?
ఓ వైపు నాసా ఏమో మేమే కనిపెట్టామని చెప్పడం.. మరోవైపు చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ మాత్రం నాసా కంటే ముందు కనిపెట్టాని ప్రకటించారు. అయితే తాజాగా ఇస్రో చైర్మన్ కె.శివన్ మాత్రం అబ్బే కనిపెట్టింది ఎవరో కాదు అందరికంటే ముందే మనమే కనిపెట్టామని చెబుతున్నారు. అయితే ప్రిస్టేజ్ కోసం వెళ్లి ఇలా చెబుతున్నారా..? అనేది ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితి. ప్రతి ఒక్కరూ పక్కాగా ఆధారాలు చూపిస్తున్నారు కానీ.. నాసా బయటపెట్టిన తర్వాత వీరందరూ రియాక్ట్ అవుతున్నారు..? అంతకుమునుపే ఎందుకు చెప్పలేదు..? అనే ప్రశ్నకు మాత్రం ఇంతవరకూ సమాధానం రాలేదు. మరి ఎవరు ఫస్టో.. ఎవరు సెకండో.. పైనున్న ఆ పెరుమాళ్లకే ఎరుక.

More News

కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - హీరో ఉద‌య్ శంక‌ర్‌

'ఆటగదరా శివ' లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌.

'బ్యూటిఫుల్' సెన్సార్ పూర్తి

 టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'.

దిశ రేప్ వీడియోల కోసం లక్షల మంది గూగుల్‌లో వెతికారు!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'మామాంగం' ట్రైల‌ర్‌, సాంగ్ లాంచ్‌

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం'