Cordelia Cruise Ship : నడిసంద్రంలో నిలిచిపోయిన వైజాగ్ క్రూయిజ్ షిప్.. ఎందుకిలా..?

  • IndiaGlitz, [Saturday,June 11 2022]

సముద్రంలో విహారయాత్రకు వెళ్లాలనుకునే వారి కోసం ఇటీవల విశాఖకు చేరుకుంది లగ్జరీ కార్డీలియా క్రూయిజ్ షిప్. కార్డీలియా క్రూయిజ్ కంపెనీ నడిపే ఈ షిప్ సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్‌ను తలపిస్తుంది. ఇటీవలే వైజాగ్ నుంచి పుదుచ్చేరికి బయల్దేరిన ఈ క్రూయిజ్‌ షిప్‌ అప్పుడే వివాదాల్లోకెక్కింది. క్యాసినో, గ్యాంబ్లింగ్ ఆడే క్రూయిజ్‌ను పుదుచ్చేరిలోకి అనుమతించేది లేదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేల్చిచెప్పడంతో ఆ నౌక శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నడి సముద్రంలోనే వుండిపోయింది. రాష్ట్రంలోని వివిధ పార్టీలు సైతం గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకడం విశేషం.

టూరిజం అభివృద్ధి కావాలి.. కానీ సంస్కృతికి విరుద్ధంగా కాదు: తమిళిసై

క్రూజ్‌‌ను అనుమతించడం, అనుమతించకపోవడంపై తాము స్పష్టంగా ఉన్నామని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. అందులో క్యాసినో, గ్యాంబ్లింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్నారు. తొలుత అలాంటివేవి లేవని నిర్ధారణ చేయాల్సి ఉందన్నారు . టూరిజంను అభివృద్ధి చేయాలనే ఆసక్తితో ఉన్నామని.. కానీ మన సంస్కృతికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తమిళిసై స్పష్టం చేశారు. కేవలం ఆదాయం కోసం యువత జీవితాలను పాడు చేయకూడదని అనుకుంటున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు.

షిప్‌లో లగ్జరీ సౌకర్యాలు:

జూన్ ఆరో తేదీన చెన్నై నుంచి బయల్దేరిన ఈ క్రూయిజ్ షిప్.. విశాఖ నుంచి జూన్ 8వ తేదీ రాత్రి బయల్దేరి జూన్ పదో తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకోవాల్సి వుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం కారణంగా ఈ షిప్ సముద్రంలోనే నిలిచిపోయింది. 2000 మంది ప్రయాణించే వీలున్న ఈ షిప్.. 36 గంటల్లో విశాఖ నుంచి చెన్నై చేరుకుంటుంది. కార్డీలియా క్రూయిజ్‌లో 11 అంతస్థులు ఉంటాయి. పదకొండో అంతస్థు నుంచి సముద్రంలో సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. పిల్లలు ఆడుకోవడం కోసం ఈ షిప్‌లో కార్డీలియా కిడ్స్ అకాడమీ పేరిట విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటు జిమ్, స్విమ్మింగ్ పూల్, కేసినో, కామెడీ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను చూడటం కోసం థియేటర్లు, 24 గంటల సూపర్ మార్కెట్ వున్నాయి.

More News

Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ మూవీకి వివాదాస్పద టైటిల్.. పాకిస్తాన్‌తో లింక్

మంచు వారి పెద్దబ్బాయి మంచు విష్ణు సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే.

pranitha subhash: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత.. ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ సినీనటి ప్రణీత తల్లయ్యారు. ఆమె శుక్రవారం సాయంత్రం పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చారు.

Janasena party : ఆయన కుమారుల బాధ్యత పార్టీదే .. కార్యకర్త కుటుంబానికి నాదెండ్ల భరోసా

దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు జనసేన ప్రమాద బీమా చేయించిందన్నారు

Pawan Kalyan: 11 ఏళ్ల తర్వాత కోనసీమలో ‘క్రాప్ హాలిడే’.. ఈ పాపం జగన్‌దే : పవన్ విమర్శలు

వైసీపీ పాలన, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు.

Janasena: కార్యకర్తల క్షేమం కోసమే పవన్ తపన.. నిరంతరం అదే ఆలోచన : నాదెండ్ల మనోహర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల క్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వుంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.