మారిన కరోనా కాలర్ ట్యూన్..

  • IndiaGlitz, [Sunday,January 17 2021]

గత కొన్ని నెలలుగా మన అనుమతి లేకుండానే మన ఫోన్‌లోకి కాలర్ ట్యూన్ చొచ్చుకొచ్చింది. దీనిపై సెటైర్లు, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. విని వినీ జనం విసిగిపోయారు. అయితే తాజాగా ఈ కాలర్ ట్యూన్ మారిపోయింది. హమ్మయ్యా.. అని సంబరపడి పోకండి.. ఇప్పటికే మీరు గమనిస్తే మీ మొబైల్‌లో మరో కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. అది కూడా ప్రమేయం లేకుండానే.. శనివారం వరకూ ‘నమస్కారం’ అంటూ కోవిడ్ 19 నిబంధనలు కాలర్ ట్యూన్‌గా వినిపించేవన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

అయితే శనివారం దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలర్ ట్యూన్ కూడా మారిపోయింది. ఇప్పటి వరకూ లాక్‌డౌన్ నిబంధనలు తొలగించినా కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పిన ఈ ట్యూన్.. ఇకపై భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌పై అవగాహన కలిగిస్తోంది. కాగా.. ఇప్పటి వరకూ కరోనా జాగ్రత్తలన్నీ హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గొంతులో వినిపించేవి. అయితే ఈ కొత్త సూచనలు మాత్రం ఓ మహిళ స్వరంలో వినిపించనున్నాయి.

More News

వాట్సాప్‌లో ఇది చూశారా?

కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

హీరోయిన్‌గా కంటే విలనిజంపైనే ఆసక్తి చూపుతున్న ముద్దుగుమ్మలు

ఇండస్ట్రీలో లేడీ విలన్స్‌కు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. స్టార్ హీరోయిన్లు సైతం విలన్స్‌గా మారి మెప్పిస్తున్నారు.

నాకు కాంపిటిష‌న్ ఎవ‌రో 15 ఏళ్ల త‌ర్వాత అర్థ‌మైంది - రామ్‌

``దేవ‌దాసు’ సినిమాతో 15 ఏళ్ల క్రితం సంక్రాంతి సీజ‌న్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాను. మ‌ళ్లీ ఇప్పుడు ‘రెడ్’ రిలీజ‌యింది.

‘ఆచార్య‌’ సెట్స్‌లోకి రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ‘ఆచార్య‌’ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశాడు.

కంగ‌నాకు షాక్‌.. లీగ‌ల్ నోటీసులు

ఫ‌ర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్.. ఈ పేరు చెబితే కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అనే పేరే ముందుగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో చాలా మంది కంగ‌నా ర‌నౌత్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారే.