తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

  • IndiaGlitz, [Monday,August 10 2020]

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా కరోనాతో 637 మంది మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 57,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. జీహెచ్ఎంసీ 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 84, కరీంనగర్‌ 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 6,24,840 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు.

విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది: చిరంజీవి

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

వరల్డ్ రికార్డుగా మహేష్ బర్త్‌డే..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. తన బర్త్‌డే ప్రపంచ రికార్డ్‌కు వేదిక అవుతుందని మహేష్ కూడా ఊహించి ఉండడు.

వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాధవీలత

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తన రాజకీయ, సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

ప్ర‌భాస్‌కు త‌ప్పేలా లేదు!!

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోయినా ప్ర‌భుత్వాలు కొన్ని విధి విధానాల‌ను ఏర్పాటు చేసి ఆ మేర‌కు షూటింగ్స్ చేసుకోవ‌చ్చున‌ని తెలియ‌జేశారు.