తెలంగాణలో శనివారం గణనీయంగా తగ్గిన కేసులు...

  • IndiaGlitz, [Sunday,July 12 2020]

తెలంగాణలో శనివారం కరోనా కేసులు చాలా వరకూ తగ్గాయి. కొద్ది రోజులుగా 5వేల శాంపిల్స్‌ను పరిశీలిస్తేనే.. 1800లకు పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ శనివారం టెస్టుల సంఖ్య భారీగా పెరగగా.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న తెలంగాణ కరోనా చరిత్రలోనే తొలిసారిగా 11062 శాంపిల్స్‌ను పరిశీలించారు. అయితే 1178 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 33,402కు చేరుకుంది.

కాగా కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 1714 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటి వరకూ 20,919 మంది డిశ్చార్జ్ అయ్యారు. 12,135 యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న కరోనా కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 348కి చేరుకుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

11 గంటలకు ‘జూమ్’ ద్వారా మీటింగ్: వరవరరావు కుటుంబం

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కుటుంబం ప్రజలను మీటింగ్‌కు ఆహ్వానిస్తోంది.

అమితాబ్‌కు కరోనా అని తేలడంతో చిరు, మహేష్, సచిన్ ట్వీట్లు

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపిన విషయం తెలిసిందే.

అభిషేక్‌, ఐశ్వర్య, జయాబచ్చన్‌ల కరోనా ఫలితమిదే...

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్త పెను సంచలనాన్ని రేపింది.

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌..

బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఏపీలో భయాందోళన రేకెత్తిస్తున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసులు భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.