close
Choose your channels

ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

Monday, August 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా.. నేడు మరికొంత తగ్గాయి. ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 45,516 శాంపిళ్లను పరీక్షించగా.. 7822 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,586కు చేరుకుంది. నేడు ఒక్క రోజే 63 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1534కు చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 76,377 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 88,672 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది, విశాఖపట్నంలో 9 మంది, ప్రకాశంలో 8 మంది, నెల్లూరు, శ్రీకాకుళంలలో ఏడుగురు చొప్పున, విజయనగరంలో నలుగురు, చిత్తూరు, కృష్ణా, కర్నూలులో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కడపలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కాగా రాష్ట్రంలో నేటి వరకూ 21,10,923 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.