close
Choose your channels

వరుసగా ఆరో రోజు 50 వేలు దాటిన కరోనా కేసులు..

Tuesday, August 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కరోనా కేసులు దేశంలో 50 వేలకు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య కూడా 18.55 లక్షలకు పైనే చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో 52,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,746కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 803 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 38,938 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,86,298 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 12,30,510కి చేరుకుంది. కాగా దేశంలో రికవరీ రేట్ 66 శాతానికి చేరుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.