close
Choose your channels

ఏపీలో షాకింగ్: హడలెత్తించిన కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

Wednesday, July 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో షాకింగ్ స్థాయిలో నేడు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కరోనా కేసులు హడలెత్తించాయి. గడిచిన 24 గంటల్లో 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 44 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 452 మంది మృతి చెందారు.

అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒకరు చొప్పున మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 805 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,378కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.