ఏపీలో షాకింగ్: హడలెత్తించిన కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

  • IndiaGlitz, [Wednesday,July 15 2020]

ఏపీలో షాకింగ్ స్థాయిలో నేడు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేడు కరోనా కేసులు హడలెత్తించాయి. గడిచిన 24 గంటల్లో 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 44 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 452 మంది మృతి చెందారు.

అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలు జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒకరు చొప్పున మరణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 805 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,378కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

More News

ఏపీలో వీడిన సస్పెన్స్.. కరోనాను కంట్రోల్ చేసిన డాక్టర్‌కు మంత్రి పదవి!

ఏపీలో సస్పెన్స్ వీడింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి ప్లేస్‌ను ఏపీ సీఎం జగన్ ఎవరితో భర్తీ చేస్తారా?

ప్రభాస్ ద్విపాత్రాభినయం..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమా ‘రాధేశ్యామ్’ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు.

అల్లు అర్జున్‌ని ఆరాదిస్తోన్న బాలీవుడ్ తారలు

ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ‘అల వైకుంఠపురములో..’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్.

జగన్ కీలక నిర్ణయం.. కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15000

ఏపీ సీఎం జగన్ కరోనా బాధితుల విషయమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో

హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేష‌న‌ల్ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌’

ఈ ఏడాది ప్రారంభంలో విడుద‌లై, ప్రేక్ష‌కాద‌ర‌ణతో బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్‌’.