కరోనా దెబ్బకు ‘అవతార్ 2’ వాయిదా

  • IndiaGlitz, [Friday,July 24 2020]

ప్రపంచ సినిమా రంగంపై కరోనా వైరస్ చాలా పెద్ద ఎఫెక్ట్‌ను చూపించింది. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా షూటింగ్స్‌ను కొంద‌రు ధైర్యం చేసి స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ క‌రోనా ఉధృతంగా ఉండ‌టంతో షూటింగ్స్ అన్నీ వాయిదాలు ప‌డుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న చిత్రం అవ‌తార్‌. జేమ్స్ కామెరూన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు జేమ్స్ కామెరూన్ సీక్వెల్‌గా ‘అవ‌తార్ 2’ ను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2021లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు కామెరూన్ ప్ర‌టించారు కూడా. కొన్ని రోజుల క్రితం ఈ సీక్వెల్ షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో స్టార్ట్ చేశారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఆపు చేస్తున్న‌ట్లు జేమ్స్ కామెరూన్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ‘ఈ సినిమాలో రియ‌ల్ షూటింగ్స్ కంటే వ‌ర్చువ‌ల్ షూటింగ్‌కు ఆస్కారం ఎక్కువ‌గా ఉంది. ఈ వ‌ర్చువ‌ల్ వ‌ర్క్ చేసే సీజీ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం అమెరికాలో ఎక్కువ‌గా ఉండ‌టంతో వ‌ర్క్ ఆగింది. దీంతో ‘అవతార్ 2’ విడుద‌ల వాయిదా వేయ‌క త‌ప్ప‌డం లేదు. 2022 సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు జేమ్స్ కామెరూన్‌.

More News

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి షాక్..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది.

శ్రీవారి సమక్షంలో ఇంతటి విషాదమా!.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..

తిరుమల శ్రీవారికి నిత్యం సేవలందించే ఓ ఉద్యోగి విషయంలో జరిగిన దారుణం వింటే కన్నీళ్లు తెప్పించక మానదు.

దేశంలో 13 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఇండియా కొనసాగుతోంది.

దేశంలో 18 కోట్ల మందికి కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన థైరోకేర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఇండియాలో కరోనా మరింత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.

‘బిచ్చగాడు 2’ ఫస్ట్‌లుక్ విడుదల

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంటోని.. హీరోగా,నిర్మాత‌గా నకిలీ’ సినిమాను నిర్మించారు.