ఈ మూడు లక్షణాలు కన్నించినా కరోనా సోకినట్టేనట..

  • IndiaGlitz, [Saturday,April 10 2021]

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సరికొత్తగా రూపు మార్చుకుని మరీ ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చే నాలుగు వారాలు మరింత క్లిష్టమైనవని చెబుతూ.. ఎప్పటికప్పుడు ప్రజానీకానికి అవగాహనను కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు కరోనా లక్షణాలతో ప్రజలు బాధపడుతుండగా... తాజాగా మరో మూడు లక్షణాలతో ఈ సెకండ్ వేవ్ భారత్‌ను తాకింది. కరోనా వైరస్ సెకండ్‌ వేవ్ మొదటి దానికంటే తీవ్రంగా ఉన్నదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటివరకు కొవిడ్‌-19 సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి. దీనికి తాజాగా మరో మూడు లక్షణాలు యాడ్ అయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ వ్యాపించిన వారిలో కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పింక్ ఐస్‌ లేదా కండ్లకలక అనేది కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌కు సంకేతమని తేలింది. కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన 12 మందిలో ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.

ఒక రకమైన వినికిడి లోపం కూడా కరోనా లక్షణమేనని వైద్యులు తేల్చారు. దీనిని కరోనా సోకిందనడానికి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ వినికిడి సమస్యలకు దారితీస్తుంది. అలాగే మరో లక్షణాన్ని కూడా నిపుణులు కనుగొన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో అనేక జీర్ణశయాంతర ఫిర్యాదులు కూడా వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, ఉదరంలో తిమ్మిరి, వికారం, నొప్పి కరోనావైరస్ సంకేతాలని వైద్యులు వెల్లడించారు.

More News

‘వకీల్ సాబ్’కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం నిన్న(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తండ్రి పాలనతో పోలుస్తూ కేసీఆర్‌ను దుయ్యబట్టిన షర్మిల

నేడు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఖమ్మంలో సంకల్ప సభ ఘనంగా జరిగింది. ఈ సభలో షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి

‘వకీల్ సాబ్’ చూస్తూ మైమరిచిపోయా.. : దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. నేడు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం అందుకోవడం ఖాయమనే టాక్‌ను సంపాదించుకుంది.

‘తగ్గేదే..లే’ అంటూ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో

అప్పట్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉండేది: అన్నపూర్ణ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎందరో నటీమణులు వెల్లడించారు.