తెలంగాణలో నిన్న మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

తెలంగాణలో సోమవారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అంతకు ముందు మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసులు 1200 లోపు మాత్రమే నమోదయ్యాయి. కానీ సోమవారం 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 11,528 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1550 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,221కి చేరుకుంది. కాగా నిన్న కరోనాతో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 365కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,178 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1197 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 23,679 మంది డిశ్చార్జ్ అయ్యారు.

More News

విశాఖ సాల్వెంట్స్ సంస్థలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ పేలుళ్లు..

విశాఖ ప్రమాదాలకు పుట్టినిల్లుగా మారుతోందేమో అనిపిస్తోంది.. ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలను చూస్తే..

ప‌వ‌న్ భ‌క్తుడి పాత్ర‌లో ఆర్జీవీ?

ప‌వ‌ర్‌స్టార్‌,జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భారీ అభిమాన గ‌ణం సొంతం. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ఆయ‌నకు అభిమానులుంటడ‌మే ఆయ‌న క్రేజ్‌కు నిద‌ర్శ‌నం.

25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుణశేఖర్ ఉత్తమ చిత్రం 'సొగసు చూడతరమా'

'రుద్రమదేవి'తో దర్శకనిర్మాతగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం 'హిరణ్యకశ్యప' ప్రారంభిస్తున్న డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్

బ‌న్నీని ఒక ఛాన్స్ ఇవ్వ‌మ‌న్న బాలీవుడ్ డైరెక్ట‌ర్‌

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి’ రికార్డులను సినిమా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

షాకింగ్.. ఏపీలో ఇవాళ ఒక్కరోజే 37 మంది మృతి

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కారణంగా 37 మంది మృతి చెందడం షాక్‌కు గురి చేస్తోంది.