close
Choose your channels

తెలంగాణలో ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదు

Monday, June 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి తెలంగాణలో ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. అది కూడా హైదరాబాద్‌ లాంటి సిటీలో భారీగా కేసులు నమోదవుతుండటం రాష్ట్ర ప్రజానికానికి కలవరపాటుకు గురిచేసే విషయం. మే నెల మొదట్లో పదుల సంఖ్యలో నమోదయిన కేసులు చివరి వారంలో మాత్రం వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. మే-31న ఒక్కరోజే ఊహించని రీతిలో కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 199 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన ఈ కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2698కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే ఐదుగురు మరణించగా.. మొత్తం మరణాల సంఖ్యకు 82కు చేరింది.

కాగా.. ఇవాళ నమోదైన 199 కేసుల్లో 122 జీహెచ్ఎంసి పరిధిలోవే. రంగారెడ్డి-40, మహబూబ్ నగర్‌-03, మేడ్చల్-10, ఖమ్మం-09 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కేసులు 122 నమోదుకావడంతో నగరవాసులు బిక్కి బిక్కిమంటున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు చూడని జిల్లాల్లోనూ ఈసారి కేసులు రావడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 12 జిల్లాల్లో మాత్రం గడిచిన 14 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. హైదరాబాద్‌లో సడలింపులు ఎక్కువగా ఇవ్వడం, ఇష్టానుసారం జనాలు తిరిగేయడంతో నగరం మొత్తం కరోనా వ్యాపించేసింది. మరోవైపు అధికారులు ఎన్నో నియంత్రణా చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా కంట్రోల్ కావట్లేదు. కాగా మున్ముంథు కేసులు పెరుగుతాయే తప్ప తగ్గే పరిస్థితి లేదని మాత్రం నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.