close
Choose your channels

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు 

Friday, July 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో నేడు రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. శుక్రవారానికి సంబంధించిన కరోనా బులిటెన్‌ను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 21 వేల 20 మందికి పరీక్షలు నిర్వహించగా 1608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఏపీకి చెందిన 1576 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కాగా.. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25,422కి చేరుకుంది. నేడు కరోనా కారణంగా 15 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 292కి చేరింది. కాగా.. ప్రస్తుతం ఏపీలో 11,936 యాక్టివ్ కేసులుండగా.. 13,194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.