బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కూడా కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్త విన్న కొన్ని గంటల వ్యవధిలేనే మరో ఊహించని విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. ఆ దేశ హెల్త్ సెక్రటరీ మ్యాట్ హాన్‌కాక్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వరుస షాకింగ్ విషయాలతో బ్రిటన్ ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా మ్యాట్ వెల్లడించారు. వైద్య నిపుణుల సూచన మేరకు తాను కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా లక్షణాలున్నాయని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి.. ఇంట్లో నుంచి పని చేస్తున్నానని తెలిపారు. ఎన్‌హెచ్ఎస్ సలహా పాటించడం ముఖ్యమని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకూ బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. మరోవైపు కరోనా వల్ల 578 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాధినేత కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రధాని, ఆరోగ్య మంత్రి త్వరగా కోలుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.

More News

షాకింగ్: బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

క‌రోనా వైర‌స్ నివార‌ణా చ‌ర్య‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ తార‌లు

"ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బ‌డిన‌ట్టుంట‌ది.." గూజ్ బమ్స్ రేపుతున్న రామ‌చర‌ణ్ బ‌ర్త్‌డే ట్రీట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీబ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు

ప‌వ‌న్‌, కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంత‌కూ వీరిద్ద‌రీ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏంటి? ఎందుకు జ‌రిగింది?