close
Choose your channels

భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

Tuesday, March 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అంతకుమించి సెల్ఫ్ క్వారంటైన్‌ అనగా స్వీయ నిర్భందం విధించికుని ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఇలా దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనుమానాలు సైతం పెనుభూతాలుగా మారాయి. మరోవైపు ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్, ఎన్ని నెగిటివ్ కేసులు నమోదవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా 382,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 16,569 మంది చనిపోయారు. 102,513 మంది కోలుకున్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 504కు చేరుకోగా, 37 మందికి పూర్తిగా స్వస్థత చేకూరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 457గా ఉంది. మరోవైపు.. మరణాల సంఖ్య 10కి చేరింది. మొత్తానికి చూస్తే.. పాజిటివ్, బాధితుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది.

ఈ రోజు వరకు రాష్ట్రాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే...

మహారాష్ట్ర - 74 కేసులు

కేరళ- 67

తెలంగాణ- 36

కర్ణాటక - 33

ఉత్తర్‌ప్రదేశ్‌- 31

గుజరాత్‌ -29

ఢిల్లీ- 29

హరియాణా- 26

రాజస్థాన్‌ - 28

పంజాబ్‌ -21

లద్దాఖ్‌ -13

తమిళనాడు-09

ఆంధ్రప్రదేశ్‌ -07

పశ్చిమబెంగాల్‌ - 07

మధ్యప్రదేశ్‌- 06

చండీగఢ్‌-06

జమ్మూకశ్మీర్‌-04

ఉత్తరాఖండ్‌ - 03

బిహార్‌-02

హిమాచల్‌ప్రదేశ్‌ -02

ఒడిశా-02

ఛత్తీస్‌గఢ్‌ -01

పుదుచ్ఛేరి-01 చొప్పున కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.