close
Choose your channels

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

Monday, April 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది. అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల పులి నాడియాకు జూపార్క్ ఉద్యోగి నుంచి వైరస్ సోకినట్టు తెలిపారు. ఆయన ద్వారా జూలోని జంతువులకు వైరస్ సోకిందని జూపార్క్ డైరెక్టర్ జిమ్ బ్రెహేనీ మీడియాకు వెల్లడించారు. ఆ నాలుగేళ్ల పులితో పాటు.. ఇదే జూలో ఉన్న మరో ఆరు పులులు, సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి. అన్నింటికీ వైద్య పరీక్షలు నిర్వహించామని.. ప్రస్తుతం పులి కోటుకుంటోందని.. ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు గత నెల 16న జూను మూసివేశారు.

భారత్‌లో హై అలెర్ట్

ఇదిలా ఉంటే.. అమెరికాలో పులికి కరోనా సోకడంతో భారత్‌లోని అన్ని జూ పార్క్‌లలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్ సీసీ) నేతృత్వంలోని సెంట్రల్ జూ అథారిటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ‘జూ’లలో హై అలర్ట్‌తో వ్యవహరించాలని, అందులోని జంతువులను సీసీటీవీల ద్వారా నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. వింత ప్రవర్తన లేదా లక్షణాలు కనబరిచే వాటిని, అనారోగ్యంగా ఉన్న వాటిని ఐసోలేట్ చేయడం లేదా క్వారంటైన్‌లో ఉంచడం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.