close
Choose your channels

దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వరుసగా ఏడో రోజు కూడా..

Thursday, August 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. వరుసగా ఏడవ రోజు సైతం కరోనా కేసులు 50 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 56,282 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,64,596కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 904 మంది మృతి చెందగా... ఇప్పటి వరకూ మొత్తం మృతుల సంఖ్య 40,699కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 5,95,501 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 13,28,337 మంది బాధితులు కోలుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.