తెలంగాణలో జనవరి 3 నుంచి పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్.. 2007 ముందు పుడితేనే, రిజిస్ట్రేషన్ ఇలా..!!

  • IndiaGlitz, [Tuesday,December 28 2021]

జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు వేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వారికి టీకా వేస్తామని.. వీరంతా కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌, పురపాలికల్లో కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీలు, వైద్య కళాశాలల్లో టీకాలు వేస్తామని హరీశ్ రావు తెలిపారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తామని మంత్రి వివరించారు.

అర్హులైన పిల్లలందరికీ కొవాగ్జిన్‌ టీకా వేస్తామని, కొవాగ్జిన్‌ టీకాను కేంద్రమే సూచించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 15-18 సంవత్సరాల పిల్లలు 22.78 లక్షల మంది ఉన్నారని, 61 సంవత్సరాలు దాటిన వారు 41.60లక్షల మంది ఉన్నారని మంత్రి చెప్పారు. అలాగే పాత్రికేయులకు బూస్టర్‌ డోస్‌ ఇస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్‌ 100 శాతం పూర్తయిందని మంత్రి తెలిపారు. వంద శాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌పై మొదటి నుంచి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి.. స్వయంగా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారని హరీశ్ రావు తెలిపారు.

ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారని.. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌శాఖలు వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యమయ్యాయని చెప్పారు. టీకాపై ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. రాష్ట్రంలో 7,970 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయని.. కరోనా విపత్కర పరిస్ధితుల్లో వ్యాక్సిన్‌ సంజీవనిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో ఇంకా రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాల్సి వుందని మంత్రి వెల్లడించారు.

More News

తెలంగాణలో మందుబాబులకు గుడ్‌న్యూస్: 31 రాత్రి 12 వరకు మద్యం షాపులు ఓపెన్‌లోనే

దేశంలో ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం.. అనేక రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్న వేళ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

'ఐరావతం' సినిమాలోని 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన బిగ్ బాస్ టీం

నూజివీడు టాకీస్ నుంచి రేఖ పలగాని సమర్పణలో  వస్తున్న చిత్రం ఐరావతం.

ఒంగోలు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్.. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో, దిగి రాక తప్పలేదుగా

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలు సెషన్స్‌ కోర్టుకు హాజరయ్యారు.

సౌరవ్ గంగూలీకి కరోనా.. ఆసుపత్రిలో చేరిక, వ్యాక్సిన్ వేయించుకున్నా పాజిటివ్

భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ తిరగబెడుతున్నట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కరోనాపై బ్రహ్మాస్త్రాలు.. భారత్‌లో అందుబాటులోకి మరో రెండు టీకాలు

దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.