close
Choose your channels

'చావు కబురు చల్లగా'కు ఝలక్ ఇచ్చిన పోలీసులు

Saturday, March 20, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చావు కబురు చల్లగాకు ఝలక్ ఇచ్చిన పోలీసులు

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగ‌ళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బన్నీవాసు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భర్తను కోల్పోయిన యువతిని చూసి ఇష్టపడి కార్తీక్ ఎలా ఆమెను వివాహం చేసుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కాన్సెప్ట్‌లో కొ్త్తదనం ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జోక్స్, బిజోయ్ సంగీతం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.

బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగానే అలరించాడు. అయితే తాజాగా కార్తికేయకు ఈ సినిమా విషయంలో సైబరాబాద్ పోలీసులు మంచి ఝలక్ ఇచ్చారు. కార్తికేయ బైక్‌పై లావణ్యను ఎక్కించుకుని పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొని బైక్ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఒక్క పోలీసులను తప్ప. దీనికి కారణం.. కార్తికేయకు హెల్మెట్ లేకపోవడం. ఇది చూసిన సైబరాబాద్ పోలీసులు ఈ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి సరదా కామెంట్ ఒకటి పెట్టారు. ‘హెల్మెట్లు పెట్టుకుని.. సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు బస్తీ బాలరాజు గారు’ అంటూ సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.   

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.