close
Choose your channels

తుఫాన్‌ అలర్ట్‌.. 16 నాటికి అత్యంత తీవ్రంగా ‘తౌక్టే’

Saturday, May 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తుఫాన్‌ అలర్ట్‌.. 16 నాటికి అత్యంత తీవ్రంగా ‘తౌక్టే’

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఈ తుపాన్ శనివారం ఉదయం లక్షద్వీప్ వద్ద కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ‘తౌక్టే’ తుపాను 16 నాటికి అత్యంత తీవ్రంగా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 18న గుజరాత్‌ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపాను కారణంగా గంటకు 150 నుంచి 175 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపింది. మరోవైపు ఈ తుపాను ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తుపానును ఎదుర్కొనేందుకు కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంతమేర ఈ తుపాను ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో, రాయలసీమలో శని, ఆదివారాల్లో 30-40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఇది ఋతుపవనాల రాకకు శుభ సంకేతమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 31నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుపాను ముప్పు దృష్ట్యా మహారాష్ట్ర గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.