ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే
Send us your feedback to audioarticles@vaarta.com
ముంబైలో శనివారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో మెగా పవర్స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది. 2019 సంవత్సరానికిగానూ.. ఈ అవార్డును ఉపాసన కామినేని కొణిదెల అందుకున్నారు. సామాజిక సేవలో ఆమె అత్యుత్తమ ప్రతిభకుగానూ ఈ అవార్డు దక్కింది. ఉపాసనకు ఈ అవార్డు రావడంపై మెగా కుటంబం చాలా హ్యాపీగా ఉంది. ఉపాసన భర్త, హీరో రాంచరణ్ తన సంతోషాన్ని ఫేస్బుక్ వేదికగా వ్యక్తం చేశారు. `డియర్ ఉప్సి..(ఉపాసనను రాంచరణ్ పిలుచుకునే ముద్దుపేరు) నీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నా కెంతో గర్వంగా ఉంది` అంటూ మెసేజ్తో పాటు ఉపాసన అవార్డు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.