ఏపీలో డేంజర్ బెల్స్: 2 వారాల్లో 24 వేల మంది పిల్లలకు కరోనా!

  • IndiaGlitz, [Thursday,June 03 2021]

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. చిన్న పిల్లల విషయంలో కొత్త భయాందోళన మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన రెండు వారాల్లో అంటే మే 18 నుంచి 31 వరకు ఏపీలో 2.3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

అందులో దాదాపు 24 వేల మంది 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. ఇందులో 2,200 మంది 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా పాజిటివ్ గా తేలిన పిల్లలో 4,200 మంది ఈస్ట్ గోదావరికి చెందిన వారే. ఈ జిల్లాని ప్రభుత్వం మేజర్ హాట్ స్పాట్ గా పరిగణిస్తోంది.

ఆ తర్వాతి స్థానంలో 3,800 కేసులతో చిత్తూరు జిల్లా ఉంది. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పిల్లలో కరోనా వైరస్ లక్షణాలు పెద్దల్లో ఉన్నత ప్రమాదకరంగా లేవు. కానీ వారి ద్వారా కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతోంది అని అంటున్నారు.

దీనితో పిల్లలపై ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం సారించాలని విద్య హక్కు ఫోరమ్ స్టేట్ కన్వీనర్ నారాయణ రావు అభిప్రాయపడ్డారు. కరోనా ఫస్ట్ వేవ్ వృద్దులపై ప్రభావం చూపింది. సెకండ్ వేవ్ యువతపై ప్రభావం చూపుతోంది. కాబట్టి థర్డ్ వేవ్ పిల్లలపై ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే అని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.

More News

తొలిసారి తన కొడుకు ఫోటో షేర్ చేసిన శ్రేయ ఘోషల్.. పేరు ఏంటంటే!

శ్రేయ ఘోషల్ ప్రస్తుతం ఇండియాలో తిరుగులేని సింగర్. అన్ని భాషల్లో పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా శ్రేయ ఘోషల్ దూసుకుపోతోంది. ఆమె పాట పాడితే అది చార్ట్ బస్టర్ కావడం ఖాయం.

బ్యాగ్రౌండ్ లేకపోతే అంతేనా.. ప్రమాదంలో యువ హీరో కెరీర్ ?

ఇటీవల బాలీవుడ్ లో ఓ యువ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే కార్తీక్ ఆర్యన్.. తన టాలెంట్, చార్మింగ్ లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాడు. బాలీవుడ్ ఫ్యూచర్ స్టార్

స్టన్నింగ్ హాట్: పరువాల ప్రదర్శనకు హద్దుల్లేవు అంటున్న ప్రగ్యా !

యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ 'కంచె' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. క్రిష్ దర్శత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రగ్యా హోమ్లీ లుక్స్ ఆకట్టుకున్నాయి..

పిక్ టాక్ : కూతుర్ని కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్న మహేష్

మహేష్ బాబు వెండితెరపై ఎంతటి సూపర్ స్టార్ అయినా తన ఫ్యామిలీ విషయంలో మాత్రం ఓ తండ్రిగా, భర్తగా చాలా సింపుల్ గా ఉంటాడు. తన పిల్లలతో తాను కూడా పిల్లాడిలా మారిపోతాడు.

సమంత అభిమానుల కౌంటర్ అటాక్ షురూ..

సమంత అక్కినేని నటించిన తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి తమిళనాడులో వివాదం మొదలైంది.