'దర్పణం' సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి .. సెప్టెంబర్‌ 6న విడుదల

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'దర్పణం'.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచే సుకొని సెప్టెంబర్‌6న గ్రాండ్ గా విడుదలకానుంది.

ఈ సందర్భంగా .....

చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది.. ప్రొడ్యూసర్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా సినిమాని నిర్మించారు ఆయన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

నిర్మాత క్రాంతి కిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము.. దర్శకుడు రామకృష్ణ మేకింగ్‌ ఈ చిత్రానికి మంచి అసెట్‌ అవుతుంది. అందరు సపోర్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. రీసెంట్‌గా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది..సెప్టెంబర్‌6 న విడుదలచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం'' అన్నారు.

కెమెరామెన్‌ః సతీష్‌ముత్యాల, ఎడిటర్‌ఃసత్యగిడుతూరి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ఃసిద్దార్ధ్‌ సదాశివుని, ప్రొడ్యూసర్‌ఃక్రాంతి కిరణ్‌ వెల్లంకి, డైరెక్టర్‌ః రామకృష్ణ వెంప

More News

అన్నం ముట్టని చిదంబరం.. ‘చెప్పలేను’.. ‘తెలీదు’ అంతే!

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం‌ను బుధవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం విదితమే.

‘సైరా’ విషయంలో నయన్ ఎందుకిలా చేసింది!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

పూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి టైటిల్ ఖ‌రారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి తెలిసిందే.

ఇది ఇక్కడితో ఆగదు..  పిచ్చా.. శని అనుకోవాలా!?

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టులో నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే.

'పిహిల్వాన్' ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా..`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.