బాలీవుడ్‌కి వెళుతున్న కామ్రేడ్‌

  • IndiaGlitz, [Wednesday,July 24 2019]

విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన 'అర్జున్‌రెడ్డి' బాలీవుడ్‌లో 'క‌బీర్‌సింగ్' పేరుతో రీమేక్ అయ్యి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ ప్ర‌జెంట్ మూవీ 'డియ‌ర్ కామ్రేడ్‌'పై బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ క‌న్నుప‌డింది. నిర్మాత న‌వీన్ ఎర్నేని, హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు భ‌ర‌త్‌క‌మ్మ‌తో క‌లిసి 'డియ‌ర్ కామ్రేడ్‌' సినిమా చూసిన క‌ర‌ణ్ జోహార్ సినిమాను రీమేక్ చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

''ఇప్పుడు సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక అద్భుతంగా న‌టించారు. గొప్ప ప్రేమ‌క‌థ‌. సినిమా మ‌నల్ని క‌దిలిస్తుంది. అంతే కాకుండా మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. ఈ సినిమాను రీమేక్ చేయ‌బోతున్నామ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నా'' అంటూ క‌ర‌ణ్ జోహార్ పోస్ట్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.