ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ‘‘ఉగాది’’ కానుక.... డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ , ఎంతంటే..?

  • IndiaGlitz, [Wednesday,March 30 2022]

ఉగాది పర్వదినానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉండగా.. కేంద్రం తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతోన్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రకటించడం లక్షలాది మంది ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది.

ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది.

కాగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు గతేడాది అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచిన సంగతి తెలిసిందే. జులై 2021 నుంచే ఆ పెంపు వర్తిస్తుందని తెలిపింది. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 జులైలోనే దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11 శాతం పెంచింది.

More News

ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల

సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. యూనిట్‌కి ఎంత, ఎప్పటి నుంచి అమలంటే..?

తెలంగాణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సామాన్యుల నడ్డి విరగ్గొట్టేందుకు రెడీ అయ్యింది.

బిచ్చగాళ్లను పలకరిస్తూ, సెల్ఫీలు దిగిన సందీప్ కిషన్‌.. సుశాంత్ సింగ్‌తో పోలుస్తున్న ఫ్యాన్స్

చిత్ర పరిశ్రమలోని హీరోలాంతా ఒకేలా వుండరు. కొందరు రిజర్వ్‌గా వుంటే.. మరికొందరు అందరితో కలుపుగోలుగా వుంటారు.

హ్యాపీ బర్త్ డే టూ నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్ ఫిక్స్

గతేడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే.

ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ.. తెరపైకి మరో డిమాండ్, కర్నూలుని మూవీ హబ్‌ చేయాలన్న కేఎస్ రామారావు

తెలుగు  నేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.