దీపా మాలిక్ బయోపిక్
- IndiaGlitz, [Monday,July 24 2017]
పారా ఒలింపిక్స్లో మన దేశానికి పతకం సాధించి పెట్టిన తొలి మహిళ దీపా మాలిక్. ఈమె జీవితాన్ని ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ. దీపా మాలిక్ బయోపిక్ కోసం రితేష్ ఆమెతో ఐదు గంటల పాటు చర్చించాడు. అనంతరం రితేష్ మాట్లాడుతూ..దీపాను కలిసినప్పుడు ఆమె తన పతకాన్ని నా చేతికి ఇచ్చినప్పుడు ఏదో తెలియని స్పందన వచ్చింది. ఆమె నా ముందుంటే దివ్యాంగురాలనే భావనే కలుగలేదు. ఎంతో ధైర్యవంతురాలు. దీపా బయోపిక్ను 2018 నుండి ప్రారంభిస్తాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను తెలియజేస్తామని అన్నారు.