డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా 'ధీవర' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. నిర్మాతలు కూడా ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. సినిమా పేరు ధీవర. నాగసాయి, విదా చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. టైటిల్ కు తగ్గట్టుగానే డైనమిక్ స్క్రిప్ట్ తో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ధీవర కాన్సెప్ట్ బాగుంది. యూత్ రిలేట్ అయ్యే విధంగా కథ ఉంది. ఆ పోస్టర్ తనకు బాగా నచ్చిందని.. ఎంటైర్ యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

దర్శకుడు విజయ్ జిక్కి మాట్లాడుతూ.. ధీవర సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్ గా ఉంటుందని.. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా ఒకేసారి రెండు జానర్స్ లో సాగుతుందని
అన్నారు.

నిర్మాత హరనాథ్ బాబు మాట్లాడుతూ .. కమర్సియల్ అంశాలకు కూడా పెద్ద పీట వేసినట్టు చెప్పాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోతో పాటు ట్రైలర్ ను విడుదల చేస్తామని చెబుతున్నారు అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని వచ్చే నెలాఖరు వరకూ ప్రేక్షకుల ముందుకు తెస్తామని అన్నారు.

భరీరథ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : క్రాంతి(ఆర్.కె), పోస్ట్ ప్రొడక్షన్ : డిజే స్టూడియో, డ్యాన్స్ : జావీద్ ఖాన్, సంగీతం : అద్దంకి వెంకటేష్, సినిమాటోగ్రఫీ : సాగర్ గొళ్లా, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : హరనాథ బాబు, దర్శకత్వం : కె. విజయ్ జిక్కి.

More News

వి.వి.వినాయక్ ఆవిష్కరించిన 'యమ్6' ట్రైలర్

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాధ్ తన్నీరు  నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’.  ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి

నిర్మాత‌ పై రేప్ కేస్‌

మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న త‌రుణంలో మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు త‌గ్గాయ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ సంద‌ర్భంలో మ‌ల‌యాళ నిర్మాత వైశాఖ్ రాజ‌న్‌పై ఎర్నాకులంకు చెందిన ఓ మోడ‌ల్

ఇన్‌స‌ల్ట్ చెయ్యొద్దంటున్న హీరో

హీరో మంచు మ‌నోజ్ ఇప్పుడు సినిమాల‌కు కాస్త బ్రేక్ తీసుకున్నాడు.

మ‌హేష్‌తో క‌త్రినా...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

ఆర్.ఆర్.ఆర్ కోసం ఇంకా మొద‌లెట్ట‌లేద‌ట‌...

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌..త్వ‌ర‌లోనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి).