అనుష్క 'నిశ్శ‌బ్దం' ఓటీలో ఎప్ప‌టినుండంటే..?

  • IndiaGlitz, [Tuesday,September 15 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా కనపడటమే కాదు.. అవకాశాలను అందిపుచ్చుకుని స‌ద‌రు పాత్ర‌ల‌కు న్యాయం చేస్తూ అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈమె న‌టించిన ‘అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి’ చిత్రాలు మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. అలాగే బాహుబలిలో అనుష్క పోషించిన దేవసేన పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. తాజాగా అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన నిశ్శ‌బ్దం కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో కొందరు నిర్మాత‌లు ఓ మోస్త‌రు సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు.‌

తాజాగా నిశ్శబ్దం ఓటీటీలో విడుద‌ల కావ‌డానికి రెడీ అయ్యింద‌ట‌. ప్ర‌ముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిశ్శ‌బ్దం సినిమాను అక్టోబ‌ర్ 2న విడుదల చేయ‌నుంద‌ని స‌మాచారం. దాదాపు రూ.25 కోట్ల‌కు ఈ డీల్ కుదిరింద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్ర‌క‌న‌ట ఉంటుంద‌ని టాక్‌. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నిశ్శ‌బ్దం చిత్రాన్ని కోన‌వెంక‌ట్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. అనుష్క‌తో పాటు మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు త‌దిత‌రులు న‌టించారు.

More News

బ‌న్నీ ఫ్యాన్స్‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న త‌మ‌న్

మ్యూజికల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆఫ్ టాలీవుడ్‌. ఈ ఏడాది విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి త‌మ‌న్ అందించిన సంగీతం హైలైట్‌గా నిలిచింది.

ఎల్‌ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు యత్నిస్తున్నాయి: రాజ్‌నాథ్

ఇండో- చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న

కరోనా వైరస్ ఊహాన్ ల్యాబ్‌లోనే పుట్టింది: డాక్టర్‌ లీ మెగ్‌ యాన్‌

కరోనా వైరస్‌లో చైనాలోని వూహాన్‌లో పుట్టిందంటూ ఎన్నో వాదనలు ఆది నుంచి వినబడుతున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

సీక్రెట్‌ చెప్పేసిన చిరు..!!

ఈ మధ్య కాలంలో సినీ అభిమానులను, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన.. మెగాభిమానులను ఆతృత కలిగించిన వార్తల్లో మెగాస్టార్‌ చిరంజీవి లుక్ ఒకటి.

శ్రావణి కేసులో నిర్మాత అశోక్‌రెడ్డి పాత్ర ఏంటి ?

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమని తెలుస్తోంది. సాయికృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, దేవరాజ్‌రెడ్డిలతో నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఆమె చావుకు కారణమని