కార్తీ నటిస్తున్న 'దేవ్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,October 25 2018]

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’ .. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ నేడు విడుదల కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.. చేతిలో హెల్మెట్ తో ,వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు.. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ ,రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు.

చెన్నై, హైదరాబాద్ , ముంబై , హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె.విగ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు

More News

త్వ‌ర‌లోనే 'టైటానిక్ 2'

అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఒక‌టి 'టైటానిక్'. జేమ్స్ కామెరూన్ దర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్‌ జంటగా నటించారు.

ర‌కుల్ ...హ్యాక్‌

సైబ‌ర్ నేర‌గాళ్లు బ్యాంకులు, ఏటీఎంలు.. ఇంట‌ర్నెట్ మోసాలే కాదు.. సినీ సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్స్‌పై కూడా ఓ క‌న్నేసే ఉంచుతారు.

అక్టోబర్ 29న రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' టీజర్ విడుదల..

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ '..  వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..

'శుభలేఖ+లు' హక్కుల్ని సొంతం చేసుకున్న బెల్లం రామకృష్ణా రెడ్డి

ఇటీవల కాలంలో  ఓ ప్రత్యేకమైన   అటెన్షన్  రప్పించుకున్న  చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా  విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను

'బంగారి బాలరాజు' సినిమా తప్పకుండా చూస్తాను - కె.వి.రమణాచారి

పరువు హత్యల నేపథ్యం లో వస్తున్న రాయలసీమ ఫ్యాక్షన్ ప్రేమకథ "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఈనెల 25న విడుదల సందర్భంగా తెలంగాణ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి