అద్భుతం.. మహా శివుడిని క్లిక్ మనిపించిన దేవిశ్రీ

ఆకాశంలో ఆధ్యాత్మిక అద్భుతం చోటు చేసుకుంది. అది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంట పడింది. ఇంకేముంది వెంటనే తన కెమెరాలో ఆ అద్భుత దృశ్యాన్ని బంధించి అభిమానులతో పంచుకున్నాడు. దేవిశ్రీ ఈ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే అభిమానులంతా థ్రిల్ ఫీలవుతున్నారు. అంతే కాదు హరహర మహాదేవ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దేవిశ్రీ కంట పడింది ఆ సదాశివుడిని ప్రతిభింబించే రూపమే.

ఇదీ చదవండి: మరో డేరింగ్ స్టెప్.. హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్

ఆకాశంలో మేఘాలు అడ్డనామాలుగా కనిపించగా, చంద్రుడు వాటి మధ్యలో ఉన్నాడు. మాహాశివుడే ఆకాశంలో ప్రత్యక్షమైనట్లుగా ఈ రూపం ఉంది. ' ఆకాశంలో శివుడు.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు వస్తున్నాడు' అని దేవిశ్రీ కామెంట్ చేశాడు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమతో పాటు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కరోనా ఎప్పడు అంతం అవుతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికి వస్తే దేవిశ్రీ నుంచి ఈ ఏడాది ఆసక్తికరమైన చిత్రాలు రానున్నాయి. అల్లు అర్జున్ పుష్ప, రవితేజ ఖిలాడీ, ఎఫ్3 చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హరీష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే రెండవ చిత్రానికి కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు. గబ్బర్ సింగ్ చిత్రంతో ఈ త్రయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

More News

మరో డేరింగ్ స్టెప్.. హాకీ ప్లేయర్ గా వైష్ణవ్ తేజ్

మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ఉప్పెనతోనే ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి చిత్రంగా ఉప్పెన లాంటి కథ ఎంచుకోవడం డేరింగ్ స్టెప్పే అని చెప్పాలి.

తెలంగాణలో కొవాగ్జిన్ రెండో డోసు బంద్...

తెలంగాణలో కొవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. తగినంత నిల్వ లేకపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా స్టాక్‌ రానందున

2 డీజీ డ్రగ్‌ను నేడు విడుదల చేయనున్న రాజ్‌నాథ్

కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) నేడు అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం

రఘురామకు తీవ్ర గాయాలు..హైకోర్టు డివిజనల్ బెంచ్ ఫైర్

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలుడటం సంచలనంగా మారింది. తనను సీఐడీ పోలీసులు తీవ్రంగా కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు.

కాల్ చేయండి.. క్షణాల్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ మీ ఇంటికే పంపిస్తాం: సోనూసూద్

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. కాస్తో కూస్తో రాష్ట్ర ప్రభుత్వాలే లాక్‌డౌన్ పెట్టి కరోనా చైన్‌ను తెంపేందుకు కృషి చేస్తున్నాయి.