అమ్మ‌ల‌కు అంకితం: దేవిశ్రీ ప్ర‌సాద్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్ ఛాలెంజ్‌ల‌ను విసురుకుంటున్నారు. సందీప్ వంగా స్టార్ట్ చేసిన బీ ద రియ‌ల్‌మేన్ ఛాలెంజ్ బాగా వైర‌ల్ అవుతుంది. సందీప్ వంగా, రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, కొర‌టాల శివ‌, సుకుమార్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ఇందులో సుకుమార్ త‌న స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ను ఛాలెంజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌ను దేవిశ్రీప్ర‌సాద్ బుధ‌వారం పూర్తి చేశారు.

దేవిశ్రీ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌ను కాస్త ఫ‌న్నీగా ఎడిట్ చేయించుకున్నారు. త‌న మేన‌ల్లుడు స‌త్యతో క‌లిసి వీడియోలో క‌న‌ప‌డ్డ దేవిశ్రీ, సుకుమార్ త‌న‌ను నామినేట్ చేశాడ‌ని తెలియ‌గానే త‌త్త‌ర‌ప‌డ‌టం, వెంట‌నే ప‌నుల‌ను చేయ‌డానికి రెడీ అవ‌డం వీడియోలో చూడొచ్చు. ఇంటిప‌నుల‌ను పూర్తి చేసిన దేవి.. త‌ర్వాత అమ్మ కోసం ఓ ఆమ్లెట్ వేశాడు. త‌ర్వాత నాన్న చిత్ర‌ప‌టాన్ని శుభ్రం చేసి, ఆయ‌న‌కు ద‌ణ్ణం పెట్టుకుని త‌ర్వాత అమ్మ‌కు కాఫీ చేసిచ్చాడు. నేను రియ‌ల్ మేన్ కాదు.. రియ‌ల్‌మేన్స్‌ను అందించిన అమ్మ‌లే గ్రేట్ అంటూ వారికి త‌న వీడియోను అంకితం చేశాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌.

More News

యూ ట్యూబ్‌లో 'ఇస్మార్ శంక‌ర్' రికార్డ్‌

అప్ప‌టి వ‌ర‌కు చాక్లెట్ బోయ్‌, ల‌వ‌ర్‌బోయ్ అనే ఇమేజ్‌తో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన రామ్‌ను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌దైన

పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీపై పెదవి విప్పిన చిరు.. ఆనందంలో ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టాలీవుడ్ సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం

అన్నీ రూమ‌ర్సేన‌ట‌.. న‌వీన్ క్లారిటీ

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమాను బోయపాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

క్వారంటైన్ టైమ్‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్న హీరోయిన్‌

కోవిడ్ 19 ఎఫెక్ట్‌తోదేశ‌మంత‌టా లాక్‌డౌన్‌లో దిగ్బంధ‌నం అయ్యింది. దీంతో సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. షూటింగ్స్ క్యాన్సిల్ అయిపోవ‌డంతో సినీ సెల‌బ్రిటీలు

‘మ‌హా స‌ముద్రం’లో మ‌రో హీరో..?

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.