close
Choose your channels

మీకు ఎగ్జిట్ పోల్స్.. మాకు ఎగ్జాట్ పోల్స్‌తో సంబరాలు!

Tuesday, May 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మీకు ఎగ్జిట్ పోల్స్.. మాకు ఎగ్జాట్ పోల్స్‌తో సంబరాలు!

అమరావతిని భ్రమరావతి అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఎలా గెలుస్తారు? అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై దేవినేని మాట్లాడుతూ.. ప్రజల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడతారని పేర్కొన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు అనుకూలంగా వచ్చాయన్న ప్రధాని మోదీ, అమిత్‌ షాకు కనువిప్పు కలుగుతుందని ఉమా చెప్పుకొచ్చారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసుకుని తెలంగాణలో జగన్‌ సంబరపడుతున్నారని.. ఈనెల 23న వెలువడే ఫలితాలతో మేము ఆంధ్రాలో సంబరాలు చేసుకుంటామన్నారు. జగన్‌కు ఏం చూసి ప్రజలు ఓటేస్తారని ఈ సందర్భంగదా ఆయన ఎద్దేవా చేశారు. 

మీ కుట్రలు బయటకు రాబోతున్నాయ్!

"2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటేశారు. 2019లో టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు అనే బాధ్యతతో ఓటేశారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. 40 రోజుల్లో అభ్యర్థులతో మాట్లాడే సాహసం కూడా జగన్‌ చేయలేదు. వెయ్యిశాతం గెలుస్తామని ధీమాగా చెప్పగలిగింది టీడీపీనే. పోలవరం పనులను చకచకా పూర్తి చేస్తుంటే కేవీపీ డబ్బా కొట్టుకుంటున్నారు. అరాచకశక్తులు రాజ్యాధికారం కాంక్షిస్తున్నాయి. ఏ ఫర్‌ అమరావతి.. పీ ఫర్‌ పోలవరం. కేసీఆర్‌ ఇచ్చిన రూ.1200 కోట్లకి కక్కుర్తి పడి రాయలసీమ ద్రోహిగా మారావు. ఫలితాలు వచ్చాక మీ కుట్రలు బయటకు రాబోతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌, జగన్‌, విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. మహిళా ప్రభంజనం మాది. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎన్ని చేసినా ఫలితం ఉండదనే సూత్రాన్ని ఇప్పటికైనా జగన్‌ తెలుసుకోవాలి. అవినీతిపరులు, అరాచకశక్తులు రాజ్యాధికారిన్ని ఆశిస్తున్నారు" అని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ఉమా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.