థర్డ్ వేవ్ ముగిసింది.. ఏ ఆంక్షలు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయొచ్చు: తెలంగాణ ప్రభుత్వం

  • IndiaGlitz, [Tuesday,February 08 2022]

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 23న మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని.. ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కరోనా ఆంక్షలు లేవని ఆయన ప్రకటించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కోవిడ్ ప్రభావం తక్కువగా ఉందని... ఫీవర్‌ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని డీహెచ్ పేర్కొన్నారు. కరోనా మూడో దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ..నిబంధనలు తప్పక పాటించాలని ఆయన సూచించారు. కరోనా థర్డ్ వేవ్ కేవలం రెండు నెలల్లోనే అదుపులోకి వచ్చిందని డీహెచ్ తెలిపారు. ఈ వేవ్‌లో టీకా తీసుకొని వారు 2.8 శాతం మంది ఆస్పత్రి పాలయ్యారని.. 31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చెప్పారు. థర్డ్ వేవ్‌లో జనవరి 25న రాష్ట్రంలో అత్యధికంగా 4,800 కేసులు నమోదైనట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మూడో దశలో కేవలం 3 వేల మంది రోగులు మాత్రమే ఆస్పత్రుల్లో చేరారన్నారు. ఇటీవల నిర్వహించిన ఫీవర్ సర్వేలో నాలుగు లక్షల మందికి కిట్లు అందజేసినట్లు తెలిపారు.

కరోనా ఆంక్షలు లేనందున అన్ని సంస్థలు 100 శాతం పూర్తి సామర్ధ్యంతో పని చేయొచ్చని డీహెచ్ సూచించారు. ఐటీ కంపెనీలు సైతం వర్క్‌ ఫ్రం హోం తీసివేయొచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంస్థలను పూర్తిగా ప్రారంభించామని.. ఆన్‌లైన్‌ తరగతులతో పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయని శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో జరగనున్న మేడారం జాతరలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీహెచ్ చెప్పారు. ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్‌ కలిగిన ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.

More News

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న 'శశివదనే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం 'శశివదనే'.

ఆ సీన్ చూస్తున్నప్పుడు.. ‘‘ఊపిరి తీసుకోలేరు, హార్ట్‌బీట్ పరిగెడుతుంది’’ : ఆర్ఆర్ఆర్‌పై జక్కన్క కామెంట్స్ వైరల్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ రిలీజ్ అవుతుందని అంతా భావించిన వేళ..

ఆ యాడ్ కోసం మహేశ్ అంత తీసుకున్నాడా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. పాలవంటి తెల్లని మేయని ఛాయతో గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు.

మహాభారత్‌లో ‘భీముడు’ ప్రవీణ్ కుమార్ ఇక లేరు

ఓ 30 ఏళ్లు వెనక్కి వెళితే.. అప్పుడప్పుడే భారత్‌లో టీవీలు రంగ ప్రవేశం చేస్తున్న  కాలం. దూరదర్శన్ తప్పించి మరో ఛానెల్ లేని సమయం.

‘‘ క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో’’ : ఎఫ్ 3 మూవీ నుంచి 'లబ్‌ డబ్‌ ' సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా.