'మజిలీ' రీమేక్లో ధనుష్
- IndiaGlitz, [Thursday,April 18 2019]
అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జంటగా నటించిన చిత్రం ' మజిలీ'. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మజిలీ' సినిమాను రీమేక్ చేయాలని ఇతర భాషలకు చెందిన హీరోలు, దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ అగ్ర నిర్మాత ఈ సినిమా రీమేక్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను తమిళంలో ధనుష్తో రీమేక్ చేయాలని సదరు నిర్మాత భావిస్తున్నాడని టాక్. నిజానికి తమిళంలో ధనుష్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫామెన్స్కు ఈ సినిమా పక్కాగా యాప్ట్ అవుతుందని అంటున్నారు. త్వరలోనే 'మజిలీ' తమిళ రీమేక్పై ఏదో ఒక సమాచారం వెలువడనుంది.