హీరో ధ‌నుష్ త‌ల న‌ర‌కుతా అంటూ బెదిరింపులు

  • IndiaGlitz, [Friday,February 21 2020]

'అసుర‌న్' సినిమాతో గ‌త ఏడాది స‌క్సెస్ అందుకున్న హీరో ధ‌నుష్ ఇప్పుడు 'క‌ర్ణ‌న్' అనే సినిమాలో న‌టిస్తున్నాడు. మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను క‌లైపులి థాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ సామాజిక వ‌ర్గాన్ని త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఈ చిత్రానికి వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. 1990లో జ‌రిగిన కుల ఘ‌ర్ష‌ణ‌లు ఆధారంగా సినిమా ఉండ‌నుంద‌ని, అందులో త‌మ‌ను త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పులిప్ప‌డై సామాజిక వ‌ర్గం ఆరోపిస్తున్నారు. త‌మ సామాజిక వ‌ర్గాన్ని త‌ప్పుగా చూపిస్తే ధ‌నుష్ త‌ల న‌రుకుతానంటూ ఓ యువ‌కుడు ఓ వీడియో పోస్ట్ చేయ‌డం దుమారం రేపుతుంది. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇక్క‌డ పేర్కొనాల్సిన విష‌య‌మేమంటే.. ధ‌నుష్ గ‌త ఏడాది హిట్ సాధించిన 'అసుర‌న్‌' సినిమా కూడా సామాజిక వ‌ర్గం, భూవివాదాల నేప‌థ్యాల‌లో సాగేదే. ఇప్పుడు మ‌రోసారి కూడా ధ‌నుష్ అలాంటి పాయింట్‌నే న‌మ్ముకున్నాడు. అయితే ఈసారి మాత్రం అత‌ని సినిమా వివాదాల్లో చిక్కుకుంది. కానీ ఈ విష‌యం అటు ధ‌నుష్‌, ఇటు నిర్మాత ఎలాంటి ప్ర‌క‌టనా ఇవ్వలేదు. అయితే సామాజిక వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌ల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్క‌డం ఇదేమీ కొత్త కాదు. అదే త‌ర‌హాలో కొత్త సినిమా రానుంది. మ‌రి ఈ వివాదం ఏ మ‌లుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం.

More News

ఏపీలో కోట్లల్లో స్కామ్.. అచ్చెన్న మెడకు ఉచ్చు!?

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఈ స్కామ్‌లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయ్.

‘కిలికి’ భాష వచ్చేసిందోచ్.. కంగ్రాట్స్ మధు!

ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’.

ఇటలీలోని డోలమైట్స్ లో  'రెడ్‌' సాంగ్‌ చిత్రీకరణ

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి.

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసిన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌

‘విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం.. కాలవాంది సొంతం.. పెరిగిందే ఇష్టం..’ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ సాహిత్యానికి అనూప్‌ రూబెన్స్‌ అందించిన స్వరాలు తోడైతే..

'ఉమామహేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య' టీజ‌ర్ విడుద‌ల‌.. ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబ‌లి`.