అచ్చెన్నా.. మంత్రి రాజీనామాకు రెడీ.. మరి మీరు..!?

  • IndiaGlitz, [Saturday,November 16 2019]

‘ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. అంతేకాదు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను’ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఇసుక విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మంత్రిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ను ధర్మాన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. మరి అచ్చెన్న రియాక్షన్ ఎలా ఉంటుందో..? ఆయన ఏ మాత్రం నిరూపిస్తారో..? ఒక వేళ నిరూపిస్తే మంత్రిగారు ఏ మేరకు రాజీనామా చేస్తారో..? మంత్రిగారయితే రెడీగా ఉన్నారు.. మరి అచ్చెన్న సంగతేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇసుక కొరతపై దీక్ష చేప్టటిన నాడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్యనేతలు స్పీచ్‌లు దంచికొట్టి.. ఇసుకాసురులు అంటూ ఓ జాబితాను సైతం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆ జాబితాలోని మంత్రులు, వైసీపీ నేతలు రియాక్ట్ అవుతూ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

జూనియర్.. జూనియర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసిన వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు. అలాగనీ ఆయన రాజకీయాల్లో ఉన్నారా..?

'నా మాటే విన‌వా' పోస్ట‌ర్ లాంచ్‌

శ్రీ‌శివాని ఆర్ట్స్& పి.ఎస్‌.మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై లింగ‌స్వామి వేముగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌శంక‌ర్‌గౌడ్ నిర్మిస్తున్నచిత్రం నా మాటే విన‌వా.

ఎవరు చూపించని యూనిక్ పాయింట్ ని 'తోలుబొమ్మలాట'లో చూపించడానికి ప్రయత్నించాం! - హీరో విశ్వంత్

కేరింత - మనమంతా - జెర్సీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ లో నటించిన యువ నటుడు విశ్వంత్ ఇప్పుడు అదే తరహాలో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కార్తీకి మరో బ్లాక్‌బస్టర్‌ 'దొంగ'

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'దొంగ'.

'వెంకీ మామ' రిలీజ్ డేట్ ?

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య, రాశీఖన్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమా విడుద‌లపై ఓ స్ప‌ష్ట‌త రాలేదు. అప్పుడు విడుద‌ల‌వుతుంది..