ధృవ అంత లేటుగా వస్తుందా..!

  • IndiaGlitz, [Tuesday,September 06 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అల్లు అర‌వింద్ ప్ర‌క‌టించారు. కానీ...ధృవ ద‌స‌రాకి రావ‌డం లేదు అని ప్ర‌చారం జ‌రుగుతుంది.
గ‌తంలో ద‌స‌రాకి రిలీజైన రామ్ చ‌ర‌ణ్ చిత్రాలు గోవిందు అంద‌రివాడేలే, బ్రూస్ లీ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. అందుచేత హ‌డావిడిగా ద‌స‌రాకి రిలీజ్ చేయ‌డం కంటే డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డం బెస్ట్ అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ధృవ ద‌స‌రాకి రావ‌డం లేదు అనే ప్ర‌చారం పై ధృవ టీమ్ స్పందించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మే అనిపిస్తుంది. మ‌రి...ధృవ టీమ్ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి..!